Monday, 12 April 2021

ఇంత అజాగ్రత్తా..? కనీస నిబంధనలు కూడా పాటించలేదు.. ‘వకీల్‌సాబ్’ ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లు సీజ్

మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌స్టార్ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘’. రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవన్ మళ్లీ వెండితెరపై కనిపిస్తున్నాడని తెలిసి.. ఈ సినిమా చూసేందుకు ఆయన అభిమానులు పోటెత్తారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక వీకెండ్‌లోనూ సినిమాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో థియేటర్ యజమానులు కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా పర్లాఖెముండిలో రెండు థియేటర్లలో ‘వకీల్‌సాబ్’ విడుదలైంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అయితే కరోనా నిబంధనలు ఏ పాటించకుండా రెండు థియేటర్లు సినిమాను ప్రదర్శించాయి. ఇది తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ రెండు థియేటర్లను సీజ్ చేశారు. ఇక హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా ఈ సినిమాని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mCWkUK
v

No comments:

Post a Comment