Tuesday, 27 April 2021

ఎక్కడివాడైతేనేం.. ఆయన మన గుండెల్లో ఉంటాడు.. ఆసక్తికర ట్వీట్ చేసిన మెగాస్టార్..

రెండో దశలో కరోనా మహమ్మారి కోరలు చాచుకొని విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, జనాలు గుంపులుగా ఉండటాన్ని పూర్తిగా నిషేధించారు. ఎటువంటి కార్యక్రమం అయినా హడావుడి లేకుండా నిర్వహించుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం వేడుకలు ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో జనాలను అనుమతించుకుండా.. కేవలం పూజారులే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో విశ్వహిందు పరిశత్ నిర్వహించే హనుమాన్ ర్యాలీని కూడా ఈసారి తక్కువ మందితో నిర్వహించారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ ఆంజనేయస్వామికి భక్తులే. రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ లోగోలో కూడా హనుమంతుడు ఉంటాడు. ఇక 2005లో హనుమాన్ అనే యానిమేషన్ చిత్రానికి కూడా చిరు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌కి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా హనుమంతుడి జన్మస్థానం ఏంటీ.. ఆయన ఎక్కడ జన్మించాడు అనే చర్చ జరుగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వారు హనుమంతుడు తెలుగు నేలకు చెందినవాడేనని ప్రకటించింది. అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థమని తితిదే కమిటీ పేర్కొంది. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా నిర్ధారిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. దీన్ని చిరంజీవి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ‘‘అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.ఈ హనుమజ్జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మనవాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసింది. ఎక్కడివాడు.. ఎప్పటివాడు.. అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్‌మ్యాన్ హనుమాన్.’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sTt51p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...