Sunday, 11 April 2021

బ్రేకింగ్: హోం ఐసోలేషన్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. కీలక ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ

భారతదేశంలో రెండో దశలో రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షలాది మంది ఈ మహ్మమారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లి.. చికిత్స పొందారు. అయితే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై పడింది. అయితే ఆయనకు కరోనా సోకలేదు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ‘‘జనసేన అధ్యక్షుడు కార్యానిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన క్వారంటైన్‌కు వెళ్లారు. కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజు వారి నిధులు నిర్వహిస్తూనే.. ఆయన పార్టీ కార్యక్రమాలో పాల్గొంటున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు’’ అని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత పవన్‌కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం(ఏప్రిల్ 9న) విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PTu3xl
v

No comments:

Post a Comment