బాలీవుడ్ సీనియర్ నటి శశికళ ఓం ప్రకాష్ (88) కన్నుమూశారు. ముంబై నగరంలోని ఆమె స్వగృహంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను రచయిత కిరన్ కొట్రైల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. శశికళ మరణించారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సంతాపం తెలుపుతూ ఆమెతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1950 నుంచి 2004 వరకు వందకు పైగా సినిమాల్లో నటించారు శశికళ. 'ముజే షాదీ కరోగీ', 'తీన్ బత్తి చార్ రాస్తా' ఆమె నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి. వెండితెరతో పాటు బుల్లితెరపైనా తనదైన నటనతో ఆమె అలరించారు. 'సోన్పారీ', 'జీనా ఇసి క నామ్ హై' వంటి హిందీ సీరియల్స్లో ఆమె కనిపించారు. భారతీయ సినీ రంగానికి శశికళ అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 2007లో ఆమెకు ఈ అవార్డు దక్కింది. మహారాష్ట్ర సోలాపూర్లో జన్మించిన ఆమె సినిమా పట్ల మక్కువతో అంచెలంచెలుగా ఎదిగి దాదాపు 4 దశాబ్దాల పాటు బీ టౌన్ ప్రేక్షకులను అలరించారు. కొలబాలోని చర్చిలో శశికళ అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cOSggY
v
No comments:
Post a Comment