పవర్స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్లో త్వరలో విడుదల కాబోతున్న చిత్రం ‘వకీల్సాబ్’. హిందీలో సూపర్హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్గా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు (ఏప్రిల్ 4న) శిల్పకళా వేదికగా జరిగింది. ఈ ఈవెంట్లో హీరోయిన్ మాట్లాడుతూ.. ‘‘ఈ వేదికపై మాట్లాడాలని ఎంతో ప్రిపేర్ అయ్యాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కానీ అందులో ఒక్క శాతం కూడా నాకు ఇప్పుడు గుర్తు లేదు. నేను ఒక పాయింట్ మాత్రం చెబుతామని అనుకుంటున్నాను. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని అంతా అంటుంటారు. కానీ, మా తెలుగు అమ్మాయిలకి హోప్ ఇచ్చి వకీల్సాబ్ టీం.. ముఖ్యంగా పవర్స్టార్ పవన్కళ్యాణ్, దర్శకుడు వేణు శ్రీరామ్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వకీల్సాబ్ జర్నీ మొత్తం నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అందుకు కారణం నాకు ఎంతో మద్దతు ఇచ్చిన పవర్స్టార్ పవన్కళ్యాణ్. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని చెప్పింది. అనంతరం మరో హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. ‘‘పవర్స్టార్ పవన్కళ్యాణ్ ఫ్యాన్స్తో ఆడిటోరియం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. వకీల్సాబ్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు వేణు శ్రీరామ్కి, నిర్మాత దిల్ రాజుకి ధన్యవాదాలు’’ అని చెప్పింది. ఈలోపే పవర్స్టార్ పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు రావడం అభిమానులు కేకలు పెడుతూ.. కోలహలం చేశారు. దీంతో అంజలి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వెళ్లిపోయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mmpMhU
v
No comments:
Post a Comment