Friday, 9 April 2021

‘తలైవి’కి తప్పని కరోనా కష్టాలు.. చేసేదేమీ లేక ఆ నిర్ణయం తీసుకున్న చిత్ర యూనిట్.. కంగనా ట్వీట్

సినీ నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘’. ఏఎల్ విజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. . ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అయితే రెండో దశలో కరోనా వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా విధించారు. ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమా చూసే పరిస్థితులు లేకపోవడంతో.. నిర్మాతలు ఇప్పటికే తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ‘తలైవి’ చిత్ర యూనిట్ కూడా ఈ నిర్ణయమే తీసుకుంది. ఈ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సినిమా విడుదలని వాయిదా వేస్తున్నామని తెలిపారు. ‘ఏప్రిల్‌ 23న అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ, కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు మద్దతు తెలుపుతూ తలైవిని వాయిదా వేస్తున్నాం’ అని శుక్రవారం ప్రకటించింది. పరిస్థితులు మెరుగైన తర్వాత చిత్ర యూనిట్ కొత్త డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రకటనని ‘థియేటర్లు తెరుచుకుంటేనే.. థియేటర్ల వ్యాపారం బాగుంటుంది’ అంటూ కంగనా ట్వీట్ చేసింది. గోతిక్ ఎంటర్టైన్మెంట్ మరియు స్ప్రింట్ ఫిలిమ్స్ అసోసియేషన్‌తో విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు జీ స్టూడియోలు సమర్పించిన తలైవి చిత్రానికి విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాత‌లు. హితేష్ ఠక్కర్ మరియు తిరుమల్ రెడ్డి స‌హ నిర్మాత‌లు. ఈ మూవీలోని పాట‌లు టీ సిరీస్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dMd2Nz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...