పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న మరణ వార్త తెలిసి చాలా బాధ పడ్డామని దంపతులు పేర్కొన్నారు. ఆదివారం రోజు పొట్టి వీరయ్య గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలిసి ఇప్పటికే చిరంజీవి, ఉదయ భాను సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలపగా.. జీవిత రాజశేఖర్ దంపతులు సోమవారం ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి వీరయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జీవిత రాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ.. ''అగ్ర హీరోలందరితోనూ నటించిన వీరయ్య.. మా తోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. వైకల్యాన్ని జయించిన వీరుడు వీరయ్య. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ బాడీ మీటింగ్స్ అయినా, అవార్డు ఫంక్షన్స్ అయినా.. ఇలా ఏ కార్యక్రమానికి పిలిచినా తప్పకుండా హాజరయ్యేవారు. మేం పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిశ్రమలో ఉన్న వ్యక్తి ఆయన. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణ వార్త ఎంతో బాధ మిగిల్చింది. ఆ కుటుంబానికి వీలైనంత సహాయం చేయాలని భావిస్తున్నాం" అన్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచే రంగస్థల కళాకారుడు. సినీరంగంలో దశాబ్ధాల పాటు ఆయన సేవలందించిన ఆయన దాదాపు 300కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఆయన మరణం టాలీవుడ్ లోకంలో విషాదం నింపింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xpPiI5
v
No comments:
Post a Comment