తెలుగు సినీతెరపై ఒకప్పుడు మాన్లీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. కుటుంబ కథ చిత్రాలతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతో చేరువయ్యారు. అయితే హీరోగా ఆయనకు తగిన అవకాశాలు రాకపోవడం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లోకి వచ్చేసి.. పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసి ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ పాత్రలతో పాటు.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా చేస్తున్న ఆయన ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లోనే కాక.. కోలివుడ్లో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్మీడియాలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే.. పలు సామాజిక అంశాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు. తాజాగా జగ్గు భాయ్ తన సోషల్మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ అయింది. అందుకు కారణం ఆయన యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్కు థ్యాంక్స్ చెప్పడమే. వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్లలో పాల్గొనే వాళ్లు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎక్కువ శాతం ఎవ్వరిని దగ్గరకు రానివ్వకుండా తమ పనులు తామే చేసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ షూటింగ్లు ముగించుకుంటున్నారు. కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు. మేకప్ మ్యాన్ అవసరం లేకుండా తనకు తానే మేకప్ చేసుకోవడం నేర్చుకున్నాను అని జగపతిబాబు తాజా పోస్ట్లో పేర్కొన్నారు. ఇది కరోనా కారణంగానే జరిగింది కాబట్టి.. దానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఇక న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. దీంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’, రిపబ్లిక్, మహాసముద్రం, లక్ష్య తదితర చిత్రాల్లో కూడా ఆయన నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dqpGCO
v
No comments:
Post a Comment