దేశంలో వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ దాటికి జనం అల్లాడిపోతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండగా.. మహారాష్ట్రలో మాత్రం వీర విహారం చేస్తోంది. అక్కడి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. సాధారణ జనంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల నడుమ కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలుపుతూ కొన్ని సూచనలు చేశారు గ్లోబల్ బ్యూటీ . అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ప్రియాంక. కరోనా తగ్గిపోయిందన్న భ్రమలో గత రెండు నెలలుగా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, ఇకనైనా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుపుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీ కోసం, మీ కుటుంబం కోసం, స్నేహితులు, పక్కింటి వాళ్లు, బంధువులు, మన ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం మీరంతా ఇంట్లోనే ఉండండి. అత్యవసరం ఉంటే తప్ప దయచేసి బయటకు రావొద్దు. బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ ధరించండి. పరిస్థితి అర్థం చేసుకోండి ప్లీజ్.. సిచుయేషన్ అలాంటిది. అలాగే మీ వంతు వచ్చినప్పుడు తప్పక వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పిన ప్రియాంక.. మనం తీసుకునే ఈ జాగ్రత్తలే వైద్యరంగంపై ఒత్తిడి తగ్గిస్తాయని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dzygzm
v
No comments:
Post a Comment