Monday, 5 April 2021

నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే కరోనా లైట్‌గా వచ్చింది.. ప్రాణహాని ఉండదు: అల్లు అరవింద్ క్లారిటీ

బడా ప్రొడ్యుసర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అల్లు అరవింద్‌కి కరోనా సోకిందనే విషయం బయటకు రావడంతో దీనిపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశారు అల్లు అరవింద్. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన మాట నిజమే అని.. అయితే తనకి ఎలాంటి కరోనా లక్షనాలు లేవని చెప్పారు అరవింద్. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాసరే పాజిటివ్ వచ్చిందనే రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ‘నాకు కరోనా వచ్చిందని చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అవును.. నాకు వచ్చిన మాట నిజమే. అసలు విషయం ఏంటంటే.. మేం ముగ్గురం స్నేహితులం కలిసి ఊరెళ్లొచ్చాం. అప్పుడే కరోనా వచ్చింది. మా ముగ్గురిలో ఇద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. నాకు మూడు రోజులు లైట్‌గా జ్వరం వచ్చి తగ్గిపోయింది. వ్యాక్సిన్ తీసుకోని స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది అనేదానికి నేనే నిదర్శనం. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుందంట కదా.. అంటే వస్తుంది కానీ చాలా లైట్‌గా వచ్చి వెళ్లిపోతుంది. అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా వచ్చినా.. వచ్చెళ్లిపోతుందంతే కానీ ప్రాణహాని ఉండదు. నా స్నేహితుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా లైట్‌గానే ఉంది. అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి..’ అని తెలిపారు అల్లు అరవింద్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cPYGMG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...