అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటుతూ.. అజయ్ కుమార్ దర్శకత్వంలో కేఎస్ రామారావు నిర్మించిన చిత్రం ‘’. 1991లో విడుదలైన ఈ చిత్రం అటు మ్యూజిక్ పరంగా, ఇటు బాక్సాఫిస్ వద్ద భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటి మాధవి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టకుండా ఉండలేరు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి సినిమా తెలుగులో మళ్లీ రాలేదు. అయితే అలాంటి సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట నిర్మాత కేఎస్ రామారావు. ఇంతటి భావోద్వేగాలతో కూడిన ఈ సినిమాని ఎవరితో చేస్తే బాగుంటుందనే ఆలోచన మొదలైన వెంటనే ముందుగా అనుష్క, కీర్తీ సురేశ్లను ఆ పాత్ర కోసం అనుకున్నారట. కానీ, నయనతారతో ఈ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నామని నిర్మాత కేఎస్ రామారావు వెల్లడించారు. గతంలో ‘శ్రీరామ రాజ్యం’ సినిమాలో సీత పాత్రలో నటించింది. ఈ పాత్రలో నయనతార అద్భుతమైన భావోద్వేగాన్ని పండించింది. దీంతో ఇప్పుడు ‘మాతృదేవోభావ’ రీమేక్లో నయనతార అయితే కరెక్ట్ అని కేఎస్ రామారావు అనుకున్నారట. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ తరం ప్రేక్షకులకు ‘మాతృదేవోభవ’ వంటి సినిమాను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే అజయ్ కుమార్ను ఈ విషయంపై పదే పదే సంప్రదిస్తూ ఉంటాను. ఈ రీమేక్కి ముందుకుగా అనుష్క, కీర్తీ సురేశ్ అనుకున్నాము. కానీ, నయనతార ఇలాంటి పాత్రలు అద్భుతంగా చేస్తుంది. కానీ, నయనతార పారితోషికం చాలా ఎక్కువ అందుకే ఈ సినిమాలో ఆమెతో చేయడం కష్టమేమో’ అని కేఎస్ రామారావు వెల్లడించారు. మరి మాతృదేవోభవ సినిమా కథ వింటే నయనతార పారితోషికం గురించి పట్టించుకోకుండా సినిమాకి ఓకే చెబుతుందని అభిమానులు అంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xijqVE
v
No comments:
Post a Comment