అభిమానులందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా అనేట్టుగానే ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. తాము దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉండే ఫ్యాన్స్.. ఇతర హీరోల సినిమా ఫంక్షన్లకు వెళ్లి రచ్చ రచ్చ చేయడం.. సీఎం సీఎం అంటూ అరవడం.. ఎవర్నీ మాటలాడకుండా చేయడం.. పవన్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ట్వీట్లు చేసినా వాళ్లను ఓ రేంజ్లో తిట్టడం.. ట్రోల్ చేయడం లాంటివి తరచూ జరిగేవే. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేశారు జనసైనికులు. పవన్ కళ్యాణ్తో పాటు మెగా హీరోలకు ఇండస్ట్రీ వైపు మార్గం చూపించి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన పెట్టిన చిరంజీవిపై అభ్యంతరకరమైన కామెంట్స్తో ఆగ్రహం చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్లు 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది.. అంతేకాదు.. ఆ తర్వాత 6 నెలలకు (2020 జులై నుంచి డిసెంబర్ వరకు) విద్యుత్ చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. అలాగే బ్యాంక్ రుణాల విషయంలో రాయితీ కల్పిస్తూ.. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ కల్పించారు. మొత్తంగా కరోనా వల్ల కుదేలైన ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలవడంతో.. మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ.. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఆదుకున్నారని.. తద్వారా వేలాది కుటుంబాలకు ఊరట లభించిందని ప్రశంసించారు. ఇక కింగ్ నాగార్జున కూడా సీఎం జగన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఓవైపు మా నాయకుడు అధికార పక్షంపైన సీఎం జగన్పైన పోరాటం చేస్తుంటే.. ఈ ప్రశంసలు ఏంటి? అంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ట్వీట్పై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘నువ్వు ఒక్కడివి చాలురా నాయన పవన్ సంకనకి పోవడానికి, అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే.. పార్టీ పెట్టి కలిపేశావు. పవన్ పార్టీ పెట్టి కష్టపడుతుంటే ఆ జైలు గాడికి నువ్వు డబ్బా కొడుతున్నావు’’ అంటూ ఓ రేంజ్ విరుచుకుపడుతున్నారు జనసైనికులు. అయితే అన్నయ్య ఏది చేసిన ఆలోచించే చేస్తారు.. మీరు అనవసరంగా ఆవేశపడకండీ.. అయితే అన్నయ్య వల్లే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చింది.. అలాంటి అన్నయ్యనే ట్రోల్ చేస్తారా? అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ ట్వీట్ వార్పై మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవిని ట్రోల్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చిరంజీవిగారే లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాణ్ణి కనీసం స్టూడియో గేట్ దగ్గరకి కూడా ఎవరూ రానిచ్చి ఉండేవాళ్ళు కాదు. హీరో కాదు కదా కనీసం జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనికొచ్చేవాడు కాదు. కాబట్టి ఈ జనసైనికులు చిరంజీవిగారిని ట్రోల్ చేసేముందు ఆలోచించుకోవాలి’ అంటూ చురకలేశారు కత్తి మహేష్. Read Also:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39QeugA
v
No comments:
Post a Comment