Thursday, 29 April 2021

వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వేయించుకోండి.. వరుణ్ తేజ్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని మన దేశం ఎంతలా సతమతమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాను చూసి ప్రపంచ దేశాలు గడగడవణికిపోతోన్నాయి. ఇప్పటికే మన దేశం మీద ఎన్నో ఆంక్షలను విధించింది. ఇక్కడి వారు తమ దేశాలకు రాకుండా నిబంధనలు పెట్టారు. అలా మనదేశంలో కరోనా ఉధృతికి అడ్డు కట్ట వేసేందుకు అందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో కోవిన్ అనే యాప్, వెబ్ సైట్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. వ్యాక్సిన్ మీదున్న అపోహలను తొలగిస్తూ ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగా ప్రిన్స్ ఓపోస్ట్ పెట్టారు. మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ కూడా ఆన్ లైన్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ఎక్కువగా ఆలోచించకండి.. వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పుకొచ్చారు. అందరూ కూడా http://cowin.gov.inలో రిజిష్టర్ చేసుకోండని సూచించారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో బిజీగాఉన్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ దెబ్బకు షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e1Hh4t
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...