Monday, 15 March 2021

మోసగాళ్లు ప్రీ రిలీజ్‌లో ‘సారంగదిరయా’ సింగర్ కోమలి వివాదాస్పద వ్యాఖ్యలు.. అక్కడ మోసపోయా.. మోహన్ బాబు సార్ దగ్గర గెలిచా

‘సారంగదరియా’ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేయడమే కాదు.. కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘సారంగ దరియా’ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యింది. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాట.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 50 మిలియ‌న్ల వ్యూస్ సాధించిన తొలి పాట‌గా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఈ రికార్డుల సంగతి పక్కన పెడితే.. ఈ పాటపై పెద్ద వివాదమే నడిచింది. కోమలి అనే జానపద సింగర్.. తన పాటను సుద్దాల అశోక్ తేజ మార్చి రాసి క్రెడిట్ కొట్టేశారని.. అలాగే, ఈ పాటను తనతో కాకుండా మంగ్లీతో పాడించడం అభ్యంతరం తెలుపుతూ మీడియాకి ఎక్కింది. ‘సారంగ దరియా’ పాటను తొలిసారి కొన్నేళ్ల క్రితం ‘రేలారే రేలా’ ప్రోగ్రామ్‌లో శిరీష అనే గాయని ఆలపించింది. అప్పుడు జడ్జీగా సుద్దాల అశోక్ తేజ ఉన్నారు. నుంచి తీసుకుని శిరీష ఈ పాటను పాడింది. కోమలి తన అమ్మమ్మ దగ్గర నుంచి ఈ పాటను సేకరించినట్టు చెప్పారు. అయితే లవ్ స్టోరీ చిత్రంలో తనను సంప్రదించకుండా తన పాటను వాడుకున్నారంటూ సింగర్ కోమలి మీడియాకి ఎక్కడంతో ‘సారంగదరియా’ సాంగ్ వివాదాస్పదం అయ్యింది. అయితే దీనిపై దర్శకుడు శేఖర్ కమ్ముల పూర్తి క్లారిటీ ఇచ్చారు. తన గత సినిమాల్లో కూడా జానపద గీతాలను ఉపయోగించుకుని డబ్బులు చెల్లించామని.. ఈసాంగ్ కూడా తమ టీం శిరీష ఫోన్ నంబర్ సంపాదించి, ఆమెని కాంటాక్ట్ చేశారని.. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అని చెప్పడంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. ఫిబ్రవరి ఆఖరులో మంగ్లీతో పాడించాం అని చెప్పారు. అయితే సుద్దాల అశోక్ తేజ సింగర్ కొమలే ఆ పాటని వెలికితీసుకొచ్చింది కాబట్టి ఆమెతో పాడిద్దాం అనుకుని ఆమెను కాంటాక్ట్ చేసి చెన్నై నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని పిలిచిన తరువాత తనకి హెల్త్ బాలేదని కోమలి చెప్పిందని.. శేఖర్ కమ్ముల తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో సింగర్ మంగ్లీతో ఆ పాటను పాడించామని.. ఆ తరువాత కూడా కోమలికి ఫోన్ చేశామని.. తనకి క్రెడిట్ ఇస్తే ఇబ్బంది లేదని చెప్పిందని.. క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇవ్వడానికి అదే విషయాన్ని ఆమెకు చెప్తే.. మీ ఇష్టం ఎంత ఇస్తే అంత ఇవ్వండని ఆమె చెప్పినట్టు శేఖర్ కమ్ముల వివరించారు. తప్పకుండా కోమలికి ప్రామిస్ చేసినట్టుగా క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తాం అని.. ఆడియో వేడుకలో కూడా ఆమెతో పాడిస్తున్నట్టు చెప్పారు శేఖర్ కమ్ముల. అయితే ఇక్కడితో ఈవివాదానికి ముగింపు పడింది అనుకుంటే.. సోమవారం నాటి ‘మోసగాళ్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగర్ కోమలి ఇన్ డైరెక్ట్‌గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లైవ్ పెర్ఫామెన్స్ చేసిన కోమలి.. డబ్బుపై జానపద గీతం అందుకుని ప్రేక్షకుల్ని అలరించింది. అయితే ఆమెను స్టేజ్ మీదికి పిలిచి మరీ సన్మానించారు. ‘కళాకారులంటే తనకి చాలా ఇష్టం అని.. ఆమెను గౌరవించడం తన సాంప్రదాయం అని.. తన నెక్స్ట్ సినిమాలో ఆమెతో ఒక పాటపాడించబోతున్నాం’ అని తెలిపారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు తనను సన్మానించడంతో కోమలి భావోద్వేగానికి గురైంది. ఆమె మాట్లాడుతూ.. ‘తనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబుకి ధన్యవాదాలు. ఇది నా తొలిమెట్టు.. నా జన్మధన్యమైంది. ఇంతకు ముందు నేను మోసపోయానండీ.. కానీ ఇప్పుడు గెలిచానండీ.. మోహన్ బాబు సార్ దగ్గర గెలిచానండీ’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది సింగర్ కోమలి. ఓవైపు దర్శకుడు శేఖర్ కమ్ముల ఆమెకు డబ్బులు ఇస్తాం అని పాటకు క్రెడిట్ ఇస్తాం అని చెప్తుంటే.. కోమలి మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38KDxkS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...