యాంకర్ అనసూయ భరద్వాజ్కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక హీరోయిన్కు ఉన్నంత క్రేజ్ అనసూయకు ఉంది. అందుకే ఆమె సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర తరవాత అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. అయితే, సినిమాల్లో పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు అనసూయ. నచ్చితే ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు ప్రత్యేక గీతాల్లో నర్తించిన అనసూయ తాజాగా ‘చావు కబురు చల్లగా’లో ఐటమ్ సాంగ్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అనసూయ ఒక ఐటమ్ సాంగ్ చేశారు. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ సాగే ఐటమ్ సాంగ్ ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఈ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ మాస్ ఐటమ్ సాంగ్లో హీరో కార్తికేయ, అనసూయ మాస్ స్టెప్పులతో దుమ్ములేపారని వీడియో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా అనసూయ సంప్రదాయ చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తున్నారు. జానీ మాస్టర్ ఆమెతో మాస్ స్టెప్పులు వేయించి పాటకు అందం తీసుకొచ్చారు. ఈ సినిమాను మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు. ఆమని, మురళీ శర్మ, రజిత, భద్రం, మహేష్, ప్రభు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు. సత్య జి ఎడిటర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37XbY7A
v
No comments:
Post a Comment