కార్తికేయ హీరోగా వస్తోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ సాగిన ఈ మాస్ నంబర్లో అనసూయ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. అయితే, ఈ పాటకు సంబంధించి నెటిజన్ అనసూయకు ట్విట్టర్ ద్వారా ఒక ప్రశ్న సంధించారు. ‘‘ఐటమ్ సాంగ్స్ చేయను అన్నారు కదా మరి ఇదేంటండి.. ఐనా ఆ లిరిక్స్ ఏంది’’ అని ఛీదరించుకుంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు తనదైన శైలిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అనసూయ. ‘‘హలో!! అది ‘ఐటమ్’ సాంగ్ కాదు.. అసలు ‘ఐటమ్’ సాంగ్ అనేది ఏది లేదమ్మా.. ఉన్న తారాగణం కాకుండా ఒక పాటకి స్పెషల్గా ఎవరన్నా కావాలి అనుకున్నప్పుడు ‘స్పెషల్’ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఇంకో విషయం, ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను’’ అని అనసూయ రిప్లై ఇచ్చారు. అలాగే, తాను స్పెషల్ సాంగ్స్ చేయను అని ఎప్పుడూ చెప్పలేదని అనసూయ క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఏమైనా అనుమానాలు ఉంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తననే నేరుగా ప్రశ్నలు అడగొచ్చని సలహా ఇచ్చారు. ‘‘ఇప్పుడు చేసినంత వెటకారంగా కాకపోయినా నిజాయతీగా ఏమన్నా తెలుసుకోవాలంటే నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను’’ అని చురక అంటించారు అనసూయ. ‘తెలిసిన సమాచారం ప్రకారం’ అంటూ వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. ‘‘నా కెరీర్ నా నమ్మకాల మీద, నేను ఎంపిక చేసుకునే వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరో రాసినదాని మీదో, టైప్ చేసిన దాని మీదో ఆధారపడి ఉండదు’’ అని కాస్త గట్టిగానే చెప్పారు అను.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b48DFA
v
No comments:
Post a Comment