Monday, 8 March 2021

హైదరాబాద్‌లో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్‌కు అవమానం.. ఒంటిపై నీళ్లు, మద్యం పోసి!

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో అవమానం జరిగిందని సమాచారం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10సి‌లో ఉన్న సన్‌బర్న్‌ సూపర్‌క్లబ్‌లో సిద్ శ్రీరాం‌మ్‌కు ఈ అవమానం ఎదురైందని తెలిసింది. ఆదివారం రాత్రి పబ్‌లో జరిగిన మ్యూజికల్ కాన్సెర్ట్‌కు హాజరైన కొందరు ఆకతాయి యువకులు సిద్ శ్రీరామ్‌పై నీళ్లు, మద్యం విసిరి అవమానించినట్టు సమాచారం. దీంతో ఆవేశానికి గురైన సిద్ శ్రీరామ్ అకతాయిలను‌ ‘గెట్ అవుట్’ అంటూ ఆగ్రహంతో వార్నింగ్ ఇచ్చారట. వెంటనే విషయం పెద్దది అవడంతో పబ్ యాజమాన్యం జోక్యం చేసుకుని గొడవను ఆపిందని అంటున్నారు. అయితే, ఈ ఈవెంట్‌కు చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారని తెలుస్తోంది. అందుకని, ఈ గొడవను బయటికి రానివ్వలేదని అంటున్నారు. ఆ యువకులపై శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పబ్ యాజమాన్యం మ్యానేజ్ చేసిందని సమాచారం. ఏదేమైనా ఒక ప్రముఖ గాయకుడికి ఈ విధంగా జరగడం బాధాకరం. కాగా, ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు సన్‌బర్న్ సూపర్‌క్లబ్‌లో సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మధ్య కాలంలో సిద్ శ్రీరామ్ తెలుగులో పాడిన ప్రతి పాట సెన్సేషనే. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తరవాత ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ మరో సెన్సేషన్ అయ్యింది. అలాగే, ‘వకీల్ సాబ్’లోని ‘మగువా మగువా’, రీసెంట్‌గా ‘శశి’ సినిమాలో ‘ఓకే ఒక లోకం’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే, తాజాగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో ‘రంగ్ దే’ సినిమా కోసం ‘నా కనులు ఎపుడు’ అనే పాటను ఆలపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sYXgon
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...