Thursday, 18 February 2021

జగన్ ఏం పీకుతాడన్నావ్.. కుప్పం నుంచి జనం నిన్నే పీకేశారు: చంద్రబాబుకి రోజా వార్నింగ్

పంచాయితీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా. జగన్ ఏం పీకుతాడన్న చంద్రబాబుని ప్రజలు తమ ఓట్ల ద్వారా కుప్పం నుంచి పీకిపారేశారంటూ ఫేస్ బుక్‌లో వీడియో షేర్ చేశారు రోజా. ‘2019లోనే చంద్రబాబు కుటిల రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తరిమి కొట్టారు. 23 సీట్లకే చంద్రబాబుని పరిమితం చేయడం చూశాం. చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క సీటు అది కూడా చంద్రబాబు కుప్పం మాత్రమే గెలవడాన్ని బట్టి.. ఓటర్లు ఎంత దారుణంగా టీడీపీని ఓడగొట్టారో చూశాం. కానీ ఇప్పుడు కుప్పంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నుంచి కూడా చంద్రబాబుని తరిమి కొట్టారు. ఈ పంచాయితీ ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి.. జగన్ గారి సుపరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో. ఇవేం పట్టించుకోకుండా.. తన పచ్చ ఛానల్స్‌లో ఏదైతే జగన్ మోహన్ రెడ్డిగారిపై విషం చిమ్ముతున్నారో.. అవే నిజం అనుకుని నిన్న చంద్రబాబు వైజాగ్ వెళ్లి.. జగన్ ఏం పీకాడు.. ఏం పీకాడు అని మాట్లాడాడు. ఈరోజు ఆయనకి అర్థమౌతోంది.. కుప్పం నుంచి ఆయన్ని జనం పీకిపారేశారని. ఇప్పటికైనా ఆయన పెద్దరికాన్ని కాపాడుకుంటూ.. జగన్ మోహన్ రెడ్డిగారు చేసే సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తే ఆయన గౌరవం నిలబడుతుంది కానీ.. ఈ విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ.. జూమ్ కెమెరాలతో జూమ్ డాన్స్‌లు వేసుకుంటూ తన పచ్చ ఛానల్స్‌లో దిగజారుడు రాజకీయాలు చేస్తే.. భవిష్యత్‌లో ఆ 23 సీట్లు కూడా మిగలవు. ఒకసీటుకే పరిమితం అవుతుంది. పంచాయితీ ఎన్నికల ఫలితాలను బట్టి.. చంద్రబాబు బలం ఏంటో ప్రజలకు అర్థం అయ్యింది. కుప్పంలో కూడా అతని స్థానం ఏంటో అర్థమైపోయింది. కుప్పం ప్రజలు కూడా విసుగుపోయి చంద్రబాబు చేసిన రాజకీయాలు చాలు.. ఇక ఆయనకి మనవడితో ఆడుకునే సమయం వచ్చిందని కుప్పం నుంచి తరిమికొట్టినట్టు స్పష్ఠంగా తెలుస్తోంది. చంద్రబాబు సొంత నియోజక వర్గంలో 90 శాతం మంచి ప్రజలు వైసీపీకి మద్దతు ప్రకటించారంటే అతని మాటలు ప్రజలు నమ్మడం మానేశారని చెప్పడానికి ఇదో ఉదాహరణ. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే నిజాన్ని తెలుసుకుని నోరుని అదుపులో పెట్టుకుని గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రోజా. ఇదిలా ఉంటే.. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సొంత నియోజక వర్గంలో జయభేరి మోగించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉండగా.. వీటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 74 పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరేయగా.. 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మరొక స్థానంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ మద్దతుదారులు అధిక పంచాయతీల్లో డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ptowcx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...