Friday, 19 February 2021

‘ఆచార్య’లో మరో స్టైలిష్ విలన్.. చిరంజీవిని ఢీకొడుతున్న బెంగాలీ నటుడు!!

మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో సోనూ సూద్ లుక్ కూడా బయటికి వచ్చింది. అయితే, ‘ఆచార్య’లో సోనూ సూద్‌తో పాటు మరో పవర్‌ఫుల్ విలన్‌ కూడా ఉన్నాడట. అతడు మరెవరో కాదు బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా అని అంటున్నారు. సోనూ సూద్‌తో పాటు జిషు సేన్ గుప్తా ‘ఆచార్య’ను ఢీకొడుతున్నారని టాక్. జిషు సేన్ గుప్తా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విలన్‌గానూ నటించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ సినిమాలో జిషు సేన్ గుప్తా ఎల్వీ ప్రసాద్ పాత్రను పోషించారు. అయితే, ‘అశ్వథ్థామ’లో విలన్‌గా నటించి మెప్పించారు జిషు. ఆ తరవాత ‘భీష్మ’లోనూ విలన్‌గా నటించి కామెడీతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ‘ఆచార్య’లో విలన్ పాత్రతో తెలుగు ఆడియన్స్ జిషు మరింత చేరువవుతారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. జిషు సేన్ గుప్తాను కొరటాల శివ మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట. ప్రస్తుతానికి అయితే ఇది రూమర్. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ ప్రకటించేవరకు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u8Fd0B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...