సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ ‘కపటధారి’. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజగత్’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు ‘కపటధారి’ అనే సస్పెన్స్ థ్రిల్లర్లో నటించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కావలుధారి’ సినిమాకు ఇది రీమేక్. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్పై ‘కపటధారి’ చిత్రాన్ని డా.ధనంజయన్ నిర్మించారు. ఆయనే స్క్రీన్ప్లే అడాప్షన్ కూడా చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. అయితే, అదే రోజు నితిన్ ‘చెక్’ సినిమా విడుదలవుతోంది. దీంతో తన సినిమా విడుదల తేదీని మార్చారు సుమంత్. చెప్పిన తేదీ కన్నా కాస్త ముందుగానే అంటే ఫిబ్రవరి 19న ‘కపటధారి’ వస్తున్నాడు. ఈ మేరకు చిత్ర నిర్మాత శుక్రవారం విడుదల తేదీని ప్రకటించారు. నిజానికి ‘చెక్’ను మొదట ఫిబ్రవరి 19న విడుదల చేస్తామన్నారు. కానీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడంతో ఫిబ్రవరి 26కు మార్చారు. ఫిబ్రవరి 19 ఖాళీ కావడంతో ఆ రోజున ‘కపటధారి’ సినిమా విడుదలవుతోంది. అయితే, అల్లరి నరేష్ ‘నాంది’ నుంచి ‘కంపటధారి’కి పోటీ ఎదురవనుంది. ‘నాంది’ కూడా అదే రోజున విడుదలవుతోంది. కొత్త విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా నిర్మాత డా.ధనంజయన్ మాట్లాడుతూ.. ‘‘కొత్త కథాంశాలతో రూపొందే చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే ‘కపటధారి’ నిర్మించాం. సుమంత్ గారు తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నాజర్, సంపత్ రాజ్, జయప్రకాశ్, నందిత అందరి పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీగా ‘కపటధారి’ని రూపొందించాం. చాలా ఏళ్ల క్రితం జరిగిన హత్యలను ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడనేదే ఈ సినిమా కథాంశం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YRaaYJ
v
No comments:
Post a Comment