Wednesday, 17 February 2021

సన్మాన సభకు తండ్రి ఆటోలో వెళ్లిన మిస్ ఇండియా రన్నరప్.. నాన్న కన్నీళ్లు తుడిచి, అమ్మ కాళ్లకు మొక్కి!

తెలంగాణ అమ్మాయి మానస వారణాసి ఫెమినా మిస్‌ ఇండియా-2020 కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫిబ్రవరి 10న జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మానస.. మిస్‌ ఇండియా వరల్డ్ 2020 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్‌ మిస్ ఇండియా రన్నరప్‌గా.. హరియాణాకు చెందిన మణికా షియోకాండ్‌ మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచారు. అయితే, వీళ్ల ముగ్గురిలో ప్రస్తుతం రన్నరప్ మాన్యా సింగ్ పేరు బాగా మారుమోగుతోంది. దీనికి కారణం ఆమె ఒక ఆటో డ్రైవర్ కుమార్తె కావడమే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా జిల్లా కుషినగర్‌లో జన్మించిన మాన్యా సింగ్ గురించి నిన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ, మిస్ ఇండియా రన్నరప్‌గా నిలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. మాన్య తండ్రి ఓంప్రకాశ్‌ సింగ్‌ ముంబైలో ఆటో నడుపుతుంటారు. తల్లి మనోరమా దేవి ముంబైలోనే ఒక టైలర్‌ షాప్‌ను నడుపుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు చూసుకుంటూ పెరిగి ఇప్పుడు మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన ఓ పేదింట అమ్మాయి మాన్యా సింగ్ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అందాల పోటీలు అంటే ధనికులకే కాదు పేదవారికి కూడా అని నిరూపించారు మాన్య. ఆ స్ఫూర్తే ఇప్పుడు ఆమెను అందలం ఎక్కించింది. మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన తర్వాత కూడా తన కుటుంబ నేపథ్యం గురించి ఎంతో గర్వంగా చెప్పారు మాన్యా సింగ్. తిండి, నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపానని ఆమె అన్నారు. డబ్బులు ఆదా చేసుకోవడానికి ఎన్నో మైళ్లు నడిచానని చెప్పారు. తనను ప్రోత్సహించడానికి, తన కళను నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని.. వాళ్ల త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడించారు. ‘‘14 ఏళ్ల వయసులో నేను మా గ్రామంలో ట్రైన్ ఎక్కాను. నా కళలను సాకారం చేసుకోవడానికి ముంబై బయలుదేరాను. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అప్పుడు నాకు తెలీదు. కానీ, నేను ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యం మాత్రమే నాకు తెలుసు. ముంబై స్టేషన్ నుంచి బయటికి రాగానే నేను చూసి ఫస్ట్ ప్లేస్ పిజ్జా హట్. అనుకోకుండా అందులోనే నాకు పార్ట్ టైమ్ జాబ్ దొరికింది. తాత్కాలిక వసతి కూడా కల్పించారు. రెండు రోజులు తరవాత నేను నాన్నకు ఫోన్ చేశాను. నాన్న ఒకటే ఏడుపు. ఆరోజు నాన్నకు నేనే ధైర్యం చెప్పాను. నేను ఉండాల్సింది ఇక్కడే అన్నాను. ఆ తరవాత రోజే అమ్మానాన్న ముంబైకి వచ్చేశారు’’ అని మాన్యా సింగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మాన్య ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముంబైలోని తన కాలేజీలో జరిగిన సన్మాన సభకు మాన్యా సింగ్ తన తండ్రి ఆటోలోనే వెళ్లడం అందరినీ ఆకర్షిస్తోంది. మాన్యా తండ్రి ఆటో నడుపుతుండగా ఆమె, ఆమె తల్లి వెనుక కూర్చున్నారు. ఇంటి నుంచి కాలేజీకి ఆటోలో వచ్చిన మాన్యా.. కాలేజీ వద్ద ఆటో దిగిన వెంటనే తల్లి పాదాలకు నమస్కరించారు. ఆనందంతో కంటతడి పెట్టుకున్న తండ్రి కన్నీళ్లను తుడిచారు. సన్మాన సభలో తన కిరీటాన్ని తీసి తండ్రికి పెట్టారు. ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ మాన్య అని కొనియాడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jUvLJz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...