Monday, 1 February 2021

అప్పుడంత మెచ్యూరిటీ లేక 'నో' చెప్పా.. ఇప్పుడైతే రెడీ అనేదాన్ని.. ఓపెన్ అయిన జాంబీ రెడ్డి హీరోయిన్

విలక్షణ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ మెప్పు పొందుతున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన లేటెస్ట్ మూవీ ''. మొదటి సినిమా 'అ!' తోనే తనలోని డిఫరెంట్ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆయన ఆ తర్వాత 'కల్కి' సినిమాతో అలరించి ఇప్పుడు 'జాంబీ రెడ్డి' రూపంలో నవ్విస్తూనే భయపెట్టబోతున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్న సందర్భంగా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఓపెన్ అయింది. తెలుగులో తన తొలిచిత్రం ‘హోరా హోరీ’ అని, తాను బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజ గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమా చేశానని దక్షా చెప్పింది. అయితే చదువు నిమిత్తం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చానని చెప్పిన ఆమె.. ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్‌ పాత్రలో తానే నటించాల్సిందని తెలిపింది. ఆ సమయంలో మెచ్యూరిటీ లేక 'నో' చెప్పాను గానీ అదే పాత్ర ఇప్పుడొస్తే 'ఎస్' అనేదాన్ని అంటూ ఆ పాత్రపై ఉన్న మక్కువను బయటపెట్టింది దక్షా నగార్కర్. ఆ తర్వాత ‘కల్కి’కి కూడా సంప్రదించారు కానీ కుదరలేదని చెప్పిన ఆమె.. మూడోసారి మిస్‌ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశానని చెప్పుకొచ్చింది. తన తాజా సినిమా 'జాంబీ రెడ్డి'లో తాను ఒంటి నిండా టాటూలతో చాలా డిఫెరెంట్‌గా కనిపిస్తానని దక్షా నగార్కర్ పేర్కొంది. ప్రశాంత్‌ వర్మ కథ చెప్పినప్పుడే ఎగ్జైట్‌ అయి ఈ సినిమాకు ఓకే చేశానని ఆమె తెలిపింది. ఇకపోతే ఈ 'జాంబీ రెడ్డి' చిత్రంలో తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో నటించగా.. రఘుబాబు, పృథ్వీ రాజ్, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషించారు. కె. రాబిన్‌ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో రాబోతున్న మొట్టమొదటి జాంబీ మూవీ ఇదే కావడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ajdDVm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...