షూటింగ్లతో ఎప్పుడూ బిజీగా ఉండే భరద్వాజ్ వీలు దొరికినప్పుడల్లా తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. నిజానికి ఈ లాక్డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో భర్త, పిల్లలతో బాగానే ఎంజాయ్ చేశారు. అయితే, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి అనసూయ విహారయాత్రకు వెళ్లారు. ఆరావళి పర్వతాల్లో ఉన్న ఓ సుందరమైన ప్రదేశానికి అనసూయ తన ఫ్యామిలీతో వెళ్లారు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా అనసూయ అభిమానులతో పంచుకున్నారు. అనసూయ స్టే చేసిన హోటల్, అక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే, ఆ ప్రకృతి అందాలతో పాటు అనసూయ అందం కూడా ఆమె అభిమానులను కట్టిపడేసింది. ఇక ఎప్పటిలానే అనసూయను ద్వేషించే కొంత మంది ఆమెపై సెటైర్లు, విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే, సోమవారం అనసూయ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ముక్కాల ముక్కాబులా పాటకు తన ఇద్దరు కొడుకులతో కలిసి అనసూయ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో అనసూయ పొట్టి నిక్కరు వేసుకుని కనిపించారు. అంతే, అనసూయ హేటర్స్ తమ క్రియేటివిటీకి పని చెప్పారు. ‘డ్రెస్ కొంచెం లాంగ్ అయ్యింది డార్లింగ్’, ‘నీ చెడ్డి ఏంది తల్లి.. మారరు’, ‘డ్రెస్ బాగుంది, ప్యాంట్ వేసుకుంటే ఇంకా బాగుండేది’.. ఇలా రకరకాల కామెంట్లు, సెటైర్లు వేశారు. ఈ వీడియోకు ‘‘నా స్వీట్ బోయ్స్తో కాస్త మామ్ టైమ్’’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, విహారయాత్ర నుంచి సోమవారం అనసూయ తిరిగి హైదరాబాద్ వచ్చారు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె దిగారు. అక్కడ ఆమెను కొందరు తమ కెమెరాల్లో బంధించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38aU0Pe
v
No comments:
Post a Comment