మెగా పవర్ స్టార్ కరోనాను జయించారు. ఆయనకు కొవిడ్-19 నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కొవిడ్-19 నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. వీలైనంత త్వరగా షూటింగ్లో పాల్గొనాలని ఉంది. మీ శుభాకాంక్షలకు మరోసారి ధన్యవాదాలు’’ అని చరణ్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్కు కరోనా సోకిన విషయం డిసెంబర్ 29న బయటపడింది. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని.. కానీ ఎలాంటి లక్షణాలు లేవని ఆనాడు చరణ్ పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆయన హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. సరిగ్గా 15 రోజుల తర్వాత చరణ్కు మళ్లీ కొవిడ్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో ఆయనకు కొవిడ్-19 నెగిటివ్ అని తేలింది. రామ్ చరణ్తో పాటు ఆయన తమ్ముడు, నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, చరణ్ కన్నా ముందుగానే వరుణ్ తేజ్ కోలుకున్నారు. తనకు కొవిడ్ నెగిటివ్ వచ్చిందని ఐదు రోజుల క్రితమే వరుణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు చరణ్ కూడా తనకు నెగిటివ్ అని తేలిందని తెలపడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రామ్ చరణ్ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రూపొందుతోన్న విషయం తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XAZTis
v
No comments:
Post a Comment