Monday, 4 January 2021

సుధీర్ బాబుతో మోహ‌నకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రారంభం

‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో , ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శకుడు మోహ‌నకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రం ఈరోజు హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభమైంది. ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టగా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేతల్లో ఒకరైన వై.ర‌విశంక‌ర్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దిల్‌ రాజు గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలు అంద‌జేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. గాజులప‌ల్లి సుధీర్‌ బాబు స‌మ‌ర్పణ‌లో బెంచ్‌మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బి. మ‌హేంద్రబాబు, కిర‌ణ్ బ‌ల్లప‌ల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె. వెంక‌టేష్‌ పనిచేస్తున్నారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రం మార్చి నుండి సెట్స్ మీద‌కు వెళ్లనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bjsrp9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...