Tuesday, 5 January 2021

‘అసలేం జరిగింది’ టీజర్: భయపడిన హీరో సునీల్

‘రోజాపూలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో శ్రీరామ్.. ఆ తరవాత ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘దడ’, ‘నిప్పు’, ‘లై’, ‘రాగల 24 గంటల్లో’ చిత్రాల్లో నటించారు. హీరోగా పరిచయమైన శ్రీరామ్.. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళ్, తెలుగులో బిజీ అయ్యారు. అయితే, చాలా కాలం తరవాత మళ్లీ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు శ్రీరామ్. ఆ చిత్రం పేరు ‘అసలేం జరిగింది’. సంచితా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. నూలేటి వీర రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల ప్రముఖ నటుడు సునీల్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ టీజర్ చూసి తనకు భయమేసిందని సునీల్ అన్నారు. టీజర్‌ను విడుదల చేసిన తర్వాత సునీల్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన కాన్సెప్టుతో తీసిన ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. శ్రీరామ్‌తో కలిసి ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో నటించానని, తను మంచి నటుడని కితాబునిచ్చారు. సినిమా పాటలు మెలోడియస్‌గా ఉన్నాయని, ఎక్సోడస్ మీడియా వైవిధ్యమైన సినిమాలు చేయాలంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ సినిమా మొత్తం థ్రిల్లింగ్‌గా ఉంటుందని, ఉయ్యాల శంకర్ కంపోజ్ చేసిన ఫైట్స్, చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవ్వగానే సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు శ్రీకర్ రెడ్డి, సంగ కుమార స్వామి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాకు నూలేటి వీర రాఘవ (ఎన్‌వీఆర్) సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా, ఏలేంద‌ర్ మ‌హావీర్ సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XeJnoe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...