కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లవర్ బాయ్గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. సినిమా సినిమాకు నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిటవుతున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ 'లక్ష్య'. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. నాగశౌర్య సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కేతిక శర్మ ఆడిపాడుతోంది. అయితే నేడు (జనవరి 22) నాగశౌర్య పుట్టినరోజు కానుకగా ఆయన అభిమానులకు టీజర్ రూపంలో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది 'లక్ష్య' చిత్రయూనిట్. నాగశౌర్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ లక్ష్య టీజర్ని ఒక నిమిషం 8 సెకనుల నిడివితో కట్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. 'చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు ఉంటాడు ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అని జగపతి బాబు వాయిస్తో వస్తున్న పవర్ఫుల్ డైలాగ్తో ప్రారంభమై.. చివరి వరకు ఆకట్టుకుంటోంది ఈ టీజర్. ఈ వీడియోలో రెండు విభిన్నమైన గెటప్లలో దర్శనమిచ్చాడు హీరో నాగశౌర్య. అందులో ఒకటి నేచురల్ లుక్ కాగా.. మరొకటి 8 ప్యాక్ గెటప్. ఇకపోతే 'పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం' అనే డైలాగ్ సినిమాపై ఆతృతను పెంచేసింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆర్చరీపై వస్తున్న మొట్టమొదటి చిత్రం ఈ 'లక్ష్య' కావడం విశేషం. ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు రోల్ కథను మలుపుతిప్పేదిగా ఉంటుందని టాక్. మొత్తానికైతే ఈ టీజర్తో 'లక్ష్య' మూవీపావు ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయనే చెప్పుకోవాలి. అతిత్వరలో చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p77BgJ
v
No comments:
Post a Comment