Thursday, 21 January 2021

దుబాయ్‌‌లో ‘సర్కారు వారి పాట’.. ఎడారి దేశంలో భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేయనున్న మహేష్

సూపర్ స్టార్ అభిమానులకు ఇది శుభావార్త. ఎందుకంటే, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ షెడ్యూల్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూట్‌ కోసం మహేష్ బాబు గురువారం దుబాయ్ బయలుదేరి వెళ్లారు. కుటుంబంతో కలిసి గురువారం ఉదయం మహేష్ బాబు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో వారు వెకేషన్‌కు వెళ్తున్నారని చాలా మంది భావించారు. కానీ, మహేష్ దుబాయ్ వెళ్లడానికి ప్రధాన కారణం ‘సర్కారు వారి పాట’ షూట్. మరోవైపు, రేపు (జనవరి 22న) నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు. తన భార్య పుట్టినరోజును కూడా దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మహేష్. అందుకే భార్య, పిల్లలను తనతో పాటు తీసుకెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకల అనంతరం నమ్రతా శిరోద్కర్ తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తారని, మహేష్ బాబు అక్కడే నెలరోజుల పాటు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, తాము దుబాయ్ బయలుదేరిన ఫొటోలను మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. ‘సర్కారు వారి పాట’కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌కు జంటగా కీర్తి సురేష్ నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమాలో మహేష్‌ బాబును కొత్తగా చూపించబోతున్నారు పరశురామ్. మంచి మెసేజ్‌తో కూడిన కమర్షియల్ మూవీ ‘సర్కారు వారి పాట’ అని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3963w6V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...