Monday, 7 December 2020

ప్రత్యేక విమానాల్లో ఉదయ్‌పూర్ చేరుకున్న మెగా, అల్లు కుటుంబాలు.. సందడే సందడి

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహ వేడుక సంబరాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మొదలైపోయాయి. నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకను ఘనంగా జరిపించడానికి మెగా ఫ్యామిలీ సోమవారం ఉదయ్‌పూర్ చేరుకుంది. కొణిదెల కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కుమారుడు కుటుంబం, అలాగే అల్లువారి కుటుంబం కూడా ఉదయ్‌పూర్ వెళ్లింది. ఈ మేరకు మెగా, అల్లు ఫ్యామిలీలు ఉదయ్‌పూర్ బయలుదేరిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముందుగా వియ్యం అందుకున్న కుటుంబాలు కలిసి ఒకే ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ బయలుదేరిన ఫొటో బయటికి వచ్చింది. ఈ ఫొటో పెళ్లి కుమారుడు చైతన్య తీసిన సెల్ఫీ. ఈ విమానంలో నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, వరుణ్ తేజ్, నిహారిక, చైతన్య, ఆయన తల్లిదండ్రులు ఉన్నారు. ఇక మరో ప్రత్యేక విమానంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉదయ్‌పూర్ వెళ్లింది. అల్లు అరవింద్, ఆయన సతీమణి నిర్మల, అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, అయాన్, అర్హ కలిసి ఒక విమానంలో వెళ్లారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మరో విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ విమానంలో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన వెళ్లారు. ఇక మెగాస్టార్ కుమార్తెల ఫ్యామిలీస్ కూడా మరో విమానంలో ఉదయ్‌పూర్ చేరుకున్నాయి. తాము ఉదయ్‌పూర్ చేరుకున్న విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మితలు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని చిన్న చిన్న వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేశారు. హోటల్‌లో అందజేసిన సేఫ్టీ, రికవరీ కిట్స్‌ను కూడా తమ పోస్ట్‌లో పొందుపరిచారు. మొత్తానికి నిహారిక, చైతన్యల పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మెగా, అల్లు, జొన్నలగడ్డ ఫ్యామిలీలు ఉదయ్‌పూర్ చేరుకున్నాయి. కాగా, నిహారిక-చైతన్య వివాహం డిసెంబర్ 9న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరగనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mSvirY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...