Wednesday, 9 December 2020

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నిహారిక, చైతన్య.. ఘనంగా వివాహం

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె వివాహం గుంటూరు రేంజ్ ఐటీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మూడుముళ్ల బంధంతో నిహారిక, చైతన్య ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల వివాహ వేడుకను నిర్వహించడానికి కొణిదెల, అల్లు కుటుంబాలతో పాటు సన్నిహితులు, బంధుమిత్రులు సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయ్‌పూర్ వెళ్లారు. సోమవారం రాత్రి సంగీత్ వేడుకను వైభవంగా నిర్వహించారు. నిన్న మెహందీ వేడుక జరిగింది. సంగీత్ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ పాల్గొన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం తన ఇద్దరు పిల్లలు అకీర, ఆద్యలతో కలిసి నిన్న వచ్చారు. మెహందీ వేడుకలో పాల్గొన్నారు. ఈరోజు మెగా, అల్లు కుటుంబాల మధ్య నిహారిక, చైతన్య వివాహం వైభవంగా జరిగింది. నిహారిక పెళ్లి సందర్భంగా ఉదయ్‌విలాస్ హోటల్ దీపాల వెలుగులు, పూలతో అందంగా ముస్తాబైంది. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇదే ఉదయ్‌విలాస్‌లో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమార్తె వివాహం జరిగింది. ఇక మన సినిమా పరిశ్రమ నుంచి రాజమౌళి కుమారుడి వివాహం కూడా ఇక్కడే జరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VWgMU9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...