Monday, 14 December 2020

చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత (77) ఆదివారం మధ్యాహ్నం తన నివాసంలో కన్నుమూశారు. అనారోగ్య కారణల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోని ఆయన నివాసం మడిపక్కంలో జరగనున్నాయి. కృష్ణమూర్తి సినీ జీవితం 1975లో వచ్చిన హంస గీత అనే కన్నడ సినిమాతో ప్రారంభమైంది. ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుడు భైరవి వెంకటసుబ్బయ్య జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు భాషల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఎన్నో సినిమాలను ఆయన రూపొందించారు. ఆఫ్ బీట్ చిత్రాల దర్శకుడిగా పేరు గడించిన ఆయన మొత్తంగా ఐదు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. Also Read: తమిళంలో ఆయన రూపొందించిన చిత్రాల్లో ''ఇందిరా, సంగమం, తెనాలి, కుట్టి, పాండవర్ భూమి, అజాగి, భారతి, జూలీ గణపతి, ఇమ్సాయ్ అరసన్ 23 ఆమ్ పులికేసి, నాన్ కడావుల్'' ముఖ్యమైనవి. కృష్ణమూర్తి రూపొందించిన చివరి చిత్రం రామానుజన్. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2014 సంవత్సరం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కృష్ణమూర్తి మరణంతో తమిళ సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K0yYti
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...