Wednesday, 9 December 2020

భార్య ఆస్తులు తాకట్టు పెట్టి పేదలకు సాయం... నువ్వు దేవుడివి సామీ

లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది కార్మికులు, నిస్సహాయులను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు బహుభాషా నటుడు . వలస కార్మికులను స్వస్థలాలకు పంపడం, అన్‌లైన్ క్లాసుల కోసం పేద విద్యార్థులకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందించడంతో పాటు పిల్లల వైద్యానికి రూ.లక్షల్లో సాయం చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అయితే ఇంతమందిని ఆదుకోవడానికి సోనూసూద్‌కు రూ.కోట్లల్లోనే ఖర్చయిందని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చాలామంది నిలదీశారు. ఓ రాజకీయ పార్టీ ఆయన వెనుకుండి క్రేజ్ కోసమే ఇదంతా చేస్తోందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార పార్టీ అయిన శివసేన సైతం ‘లాక్‌డౌన్‌లో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడు’ అంటూ ఆయన్ని ఎద్దేవా చేసింది. అయితే సోనూసూద్ అంతమందిని ఎలా ఆదుకున్నాడన్న విషయమై తాజాగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సోనూసూద్ తన చేతిలో ఉన్న డబ్బు సరిపోక ఏకంగా కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టేశాడట. ముంబైలోని జూహూ ఏరియాలో తన భార్య పేరిట ఉన్న రెండు షాపులు, ఆరు ఫ్లాట్లను తనఖా పెట్టి రూ.10 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. ఆ డబ్బుతోనే అందరికీ సాయం చేస్తూ వస్తున్నాడట. దీనిపై జెఎల్‌ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేష్ మెహతా స్పందిస్తూ.. ఆ ఆస్తులన్నీ సోనూసూద్ అతడి భార్య పేరు మీద ఉన్నాయని, వాటి మీద వచ్చే అద్దెలు వారే అందుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం రూ.10కోట్ల అసలు, దానికి వడ్డీ చెల్లించాల్సి ఉందన్నారు. అయితే దీనిపై సోనూసూద్ ఇంకా స్పందించలేదు. ఈ వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు.. నువ్వు దేవుడివి సామీ’.. అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/370d1mS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...