Friday, 25 December 2020

రజినీకాంత్‌కు అస్వస్థత: అసలేం జరిగింది.. ఇవిగో పూర్తి వివరాలు

సూపర్ స్టార్ అస్వస్థతకు గురయ్యారనే వార్త బయటికి రాగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న తలైవా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు. రజినీకి కరోనా నెగిటివ్ వచ్చినా ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే ఆందోళనకర పరిస్థితి అభిమానుల్లో ఏర్పడింది. చాలా మంది అభిమానులు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ వద్దకు రజినీ అభిమానులు చేరుకున్నారు. అసలు రజినీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు.. ఆయన అస్వస్థతకు గల కారణాలేంటి వంటి విషయాలు ఇలా ఉన్నాయి..✦ రజినీకాంత్ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు వచ్చారు. ✦ రామోజీ ఫిల్మ్ సిటిలోని విలేజ్ సెట్‌లో ‘అన్నాతె’ సినిమా చిత్రీకరణలో రజినీకాంత్ పాల్గొన్నారు. ✦ డిసెంబర్ 29 వరకు ‘అన్నాతె’ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ✦ ‘అన్నాతె’ చిత్ర బృందంలో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్ రావడంతో దర్శకుడు శివ షూటింగ్‌ను నిలిపివేశారు. ✦ నాలుగు వారాలపాటు చిత్రీకరణ వాయిదా వేస్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయం తీసుకుంది. ✦ అపోలో వైద్యులు ఈనెల 22న రజినీకాంత్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో రజినీకాంత్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. ✦ డిసెంబర్ 22 నుంచి రజినీకాంత్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ✦ ఈరోజు ఉదయం రక్తపోటు అధికం కావడంతో రజినినీ ఆయన సిబ్బంది అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ✦ డాక్టర్ కె.హరిబాబు పర్యవేక్షణలో రజినీకాంత్‌కు చికిత్స అందిస్తున్నారు. ✦ ‘అన్నాతె’ సినిమా కోసం రోజూ 14 గంటలపాటు రజినీకాంత్ పనిచేసినట్టు తెలుస్తోంది. దీని వల్లే ఆయనకు రక్తపోటు పెరిగిందని సమాచారం. ✦ డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ రజినీకాంత్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురికావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hoJrLt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...