ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. తమకు నచ్చిన వాటి గురించి చర్చించడానికి, వెతకడానికి, హ్యాష్ట్యా్గ్లతో పోస్టులు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే సోషల్మీడియా సినీ స్టార్స్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దీంతో ఏటా ఎవరి పేరు మీద ఎక్కువ ట్వీట్స్ చేశారు, ఏ సెలబ్రెటీ గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించారు... అన్న విషయాలను ట్విటర్ వెల్లడిస్తుంటుంది. ఈ కోవలోనే 2020 సంవత్సరానికి సంబంధించి దక్షిణ భారత సూపర్స్టార్స్ వీరేనంటూ టాప్-10 జాబితాను ట్విటర్ ఇండియా షేర్ చేసింది. ‘మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది! 2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత సూపర్ స్టార్స్’ అంటూ ట్వీట్ చేసింది. ఆ జాబితాలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు నెంబర్వన్ స్థానాన్ని ఆక్రమించగా... పవర్స్టార్ పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్ దక్కించుకున్నారు. తమిళ సూపర్స్టార్ విజయ్ 3, ఎన్టీఆర్ 4, సూర్య ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది హీరోయిన్ల విషయానికొస్తే.. మహానటి కీర్తి సురేష్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కాజల్, సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే నిలిచారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oIWhqi
v
No comments:
Post a Comment