Monday, 14 December 2020

'రామాయణం'లో భాగం కాబోతున్న త్రివిక్రమ్.. 1000 కోట్లతో అల్లు అరవింద్ పక్కా ప్లాన్!

భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చే స్టార్ హీరోల సినిమాలను పాన్ ఇండియా మూవీస్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు దర్శకనిర్మాతలు. చిత్రంలో హైరేంజ్ విజువల్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే బడా నిర్మాత 'రామాయణ' రూపంలో మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో త్రివిక్రమ్ కూడా భాగం కాబోతున్నారని తెలిసింది. భారత దేశ సినీ పరిశ్రమ గర్వించే రేంజ్‌లో పలు భాషల్లో 'రామాయణ' రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ భారీ సినిమా నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగం కానుండగా.. అందులో ఒకరిగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఉండటం ఆసక్తికర అంశం. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా భారీ హంగులతో ఈ సినిమా రూపొందనుందని విన్నాం. సాధారణంగా 'రామాయణ' కథ అందరికీ తెలిసిందే అయినా నేటితరం ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా వినూత్నంగా ప్రెజెంట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం 1000 కోట్ల పైనే కేటాయించారట. Also Read: అయితే ఈ కథను సానబట్టి రోమాలు నిక్కబొడిచే డైలాగ్స్ రాయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అల్లు అరవింద్ కీలక బాధ్యతలు అప్పజెప్పారని సమాచారం. దీనికి ఓకే చెప్పిన త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే అందించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రామాయణ కాన్సెప్ట్‌తో కొన్ని సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. అయితే ఈ కథలో మాటలు, స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమని భావించి త్రివిక్రమ్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారట. చూడాలి మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకొస్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37dLvlW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...