Tuesday, 17 November 2020

కాజల్ మళ్లీ బిజీ బిజీ: డేట్ ఫిక్స్.. ఇక రొమాన్స్‌కి సెలవ్!

స్టార్ హీరోయిన్ అగర్వాల్ ప్రస్తుతం మాల్దీవుల్లో భర్త గౌతమ్ కిచ్లుతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తు్న్నారు. హానీమూన్ కోసం మాల్దీవులు వెళ్లిన కాజల్.. అక్కడ భర్తతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ రొమాంటిక్ మూడ్ నుంచి కాజల్ బయటికి రాబోతున్నారు. త్వరలోనే హనీమూన్ ట్రిప్‌ను ముగించి ముంబై రాబోతున్నారు కాజల్. మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో నటించేందుకు కాజల్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఆమె ‘ఆచార్య’ సినిమాను సైన్ చేశారు. అయితే, లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు ఆగిపోవడంతో ఆమె ఇంకా ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొనలేదు. అయితే, డిసెంబర్ 5 నుంచి ఆమె ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అంటే, కాజల్ మళ్లీ షూటింగ్స్‌తో బిజీ బిజీగా గడపబోతున్నారన్నమాట. డిసెంబర్ ప్రారంభంలో కాజల్ హైదరాబాద్ రాబోతున్నారని సమాచారం. పెళ్లి తరవాత కాజల్ షూటింగ్‌లో పాల్గొంటున్న తొలి చిత్రం ‘ఆచార్య’. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. గౌతమ్ కిచ్లుతో తనకు నిశ్చితార్థం అయినట్టు కాజల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరి వివాహం అక్టోబర్ 30న ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ చాలా తక్కువ మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహ వేడుక జరిపారు. వివాహం జరిగిన తరవాత రోజే గౌతమ్-కాజల్ దంపతులు కొత్త ఇంటిలో దిగారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35DbAdk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...