Friday, 20 November 2020

చేతులు మారిన ‘లూసిఫర్’.. రంగంలోకి కోలీవుడ్ డైరెక్టర్

మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని చిరంజీవి భావిస్తు్న్నారు. ముందుగా ఈ సినిమా ‘సాహో’ డైరెక్టర్ చేతికి వచ్చింది. స్ర్కిప్టు మొత్తం పూర్తయ్యాక కొన్ని కారణాలతో సుజీత్ తప్పుకోగా.. వి.వి.వినాయక్ ఎంట్రీ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఆయన కూడా తప్పుకోవడంతో రీమేక్‌ చిత్రాలకు కమర్షియల్‌ హంగులు అద్దడంలో దిట్ట అయిన ‘గబ్బర్‌సింగ్‌’ దర్శకుడు హరీష్‌ శంకర్‌ చేతుల్లోకి ఈ చిత్రం వెళ్లిందని ప్రచారం జరిగింది. అయితే తాను ఆ సినిమా చేయడం లేదని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి మరో డైరెక్టర్ పేరు వచ్చి చేరింది. అయితే ఆయన తెలుగు దర్శకుడు కాదు. రామ్‌చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ధ్రువ’ సినిమా గుర్తింది కదా.. ఆ సినిమా మాతృక అయిన ‘తని ఒరువన్’ను డైరెక్టర్ చేసిన . తెలుగులో ఎన్నో చిత్రాల సమర్పకుడిగా ఉన్న ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ మోహన్ రాజా. చిరంజీవి కెరీర్లో మంచి చిత్రంగా నిలిచిపోయిన ‘హిట్లర్’కు ఎడిటర్ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీంతో మెగాస్టార్‌కు వీరి కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో దర్శకుడితో తెరంగ్రేటం చేసిన మోహన్ రాజా ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమకే పరిమితమయ్యారు. ఆయన రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లూసిఫర్ రీమేక్‌ మోహన్ రాజా చేతుల్లోకి వెళ్లినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. చిరంజీవి చెప్పినట్లుగా ఆయన స్ర్కిప్ట్ కూడా మార్చి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే గానీ అసలు ఇది వాస్తవమా? కాదా? అన్నది తెలియదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kOdz2P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...