తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. భాస్కర్కు భార్య, కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా భాస్కర్ గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (నవంబర్ 4) ఉదయం 8 గంటలకు భాస్కర్ తుది శ్వాస విడిచారు. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్తో కలిసి కోలా భాస్కర్ ఎక్కువ సినిమాలకు పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో క్లాసిక్ మూవీస్ వచ్చాయి. తెలుగులో ‘ఖుషి’, ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలకు కోలా భాస్కర్ ఎడిటర్గా పనిచేశారు. అలాగే, తమిళంలో ‘పుధుపెట్టాయి’, ‘మయక్కమ్ ఎన్న’, ‘పోక్కిరి’, ‘విళ్లు’ తదితర సినిమాలకు పనిచేశారు. కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ.. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో ‘నన్ను వదలి నీవు పోలేవులే’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ స్వయంగా నిర్మించారు. కాగా, కోలా భాస్కర్ మృతి పట్ల తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JC0RHN
v
No comments:
Post a Comment