Friday, 20 November 2020

బాలయ్య ఈజ్ బ్యాక్.. ఇద్దరు హీరోయిన్లతో రేపటి నుంచి రొమాన్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహా నందమూరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్న షెడ్యూల్‌ను పూర్తిచేశారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల షూటింగ్ గడిచిన ఎనిమిది నెలలుగా ఆగిపోయింది. కొంత మంది హీరోలు ఇటీవల షూటింగ్‌లు ప్రారంభించినా బాలకృష్ణ ఆసక్తి చూపలేదు. అయితే, ఎట్టకేలకు ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. రేపటి నుంచి (నవంబర్ 21 నుంచి) బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ షురూ చేయనున్నారని తెలిసింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈనెల ప్రారంభంలో మొదలైంది. కానీ, మేజర్ షెడ్యూల్ రేపటి నుంచి మొదలుకాబోతోందని అంటున్నారు. హీరోయిన్లు పూర్ణ, సయేషాలతో కలిసి బాలయ్య షూటింగ్ షురూ చేయనున్నారట. ఈ సినిమాను పూర్ణ చాలా రోజుల క్రితమే అంగీకరించారు. సాయేషా మాత్రం మలయాళ నటి ప్రయాగ మార్టిన్ స్థానాన్ని భర్తీ చేస్తున్నారని టాక్. Also Read: కాగా, నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఇంట్రడక్షన్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య లుక్ కొత్తగా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nLnx7h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...