కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్ని రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో సోమవారం టీఆర్ఎస్ మానిఫెస్టోను విడుదల చేసిన సీఎం .. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వల్ల కుదేలైన తెలుగు సినీ పరిశ్రమకు తాము అండగా ఉంటామని పలు రాయితీలు ప్రకటించారు. దీంతో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ .. కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. Also Read: ‘‘కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్లో షోలను పెంచుకునేందుకు అనుమతి, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో, ఆయన విజన్కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది’’ అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, చిరంజీవి ట్వీట్ను టాలీవుడ్లోని పలువురు హీరోలు రీట్వీట్ చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలా తెలియజేసిన వారిలో యంగ్ హీరోలు నితిన్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ వ్యాప్తంగా తక్షణమే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకోవడానికి కూడా అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని జీవోలో సూచించింది. 50 శాతం సిటింగ్ కెపాసిటీతో థియేటర్లు నడుపుకోవచ్చని పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/374WkFX
v
No comments:
Post a Comment