సినిమా హీరోలుగా సత్తా చాటుతున్న నటీనటులు నిర్మాతలుగా, దర్శకులుగా కూడా మారి సత్తా చాటడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో వెళ్లబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో . గతంలో నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించిన ఆయన ఇక డైరెక్టర్గా కూడా విజయాలందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు బడా స్టార్ అమితాబ్తో కలిసి ఓ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ప్రముఖ సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అజయ్ దేవగణ్, కాంబోలో సినిమా రాబోతోందని, దానికి 'మేడే' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నటిస్తూ దర్శకత్వం వహించనుండటం మేజర్ అట్రాక్టివ్ పాయింట్. అంతేగాక ఏకంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ను అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేయనుండటం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. Also Read: హ్యుమన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో 'మేడే' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇకపోతే అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబోలో దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ ఈ సినిమానే రానుండటం ప్రేక్షకుల్లో ఆతృత కలిగిస్తోంది. ఈ సినిమాతో అజయ్ దర్శకత్వ ప్రతిభ పూర్తిగా బయటపడనుందని టాక్. గతంలో 2008లో వచ్చిన 'యూ మీ ఔర్ హమ్' సినిమాకు దర్శకత్వం వహించారు అజయ్ దేవగణ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p6nJPU
v
No comments:
Post a Comment