Sunday, 11 October 2020

Nuvve Kavali: ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది: స్రవంతి రవికిషోర్

టాలీవుడ్‌లో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చినప్పటికీ కొన్నే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాయి. వాటిలో ‘’ సినిమా ఒకటి. ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌పై తరుణ్‌, రిచా, సాయికిరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై మంగళవారానికి (13-10-2020)కి 20ఏళ్లు పూర్తవుతోంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అసలు ఈ ఫీల్‌గుడ్ మూవీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కాల్సింది. కానీ ఆ సమయంలో ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఉషాకిరణ్ మూవీస్‌ సహకారంతో నిర్మించారు. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్రవంతి రవికిషోర్ తన అనుభవాలను పంచుకున్నారు. ‘నువ్వేకావాలి’ సినిమా 20 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘నువ్వే కావాలి’ సినిమాకి మాతృక మలయాళీ సినిమా ‘నిరమ్‌’. నా మనసుకు బాగా నచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిచాలనిపించింది. వెంటనే విజయ్‌భాస్కర్‌కి ఫోన్ చేసి దాని గురించి చెప్పారు. మరుసటి రోజే నేను, విజయ్‌భాస్కర్‌, త్రివిక్రమ్‌ కలిసి ‘నిరమ్’ సినిమా మళ్లీ చూశాం. దాని ప్రేరణగా వాళ్లు ‘నువ్వేకావాలి’ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆ సమయంలో సినిమా తీసేంత ఆర్థిక స్తోమత నాకు లేదు. కానీ ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలన్న కోరిక బలంగా ఉంది’ ‘అప్పుడే రామోజీరావు గారు నాకు గుర్తొచ్చారు. ‘మంచి కథ ఉంటే చెప్పండి. మా బ్యానర్‌లో సినిమా చేద్దాం’ అని ఆయన అన్న మాటలు గుర్తొచ్చి కలిశాను. ‘మీరు చేయబోయే పనిమీద నీకు నమ్మకం ఉంది కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుకెళ్లండి’ అని చెప్పారు. 13-10-2000 తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అప్పట్లోనే 3కోట్ల మందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూశారు. అప్పటివరకూ నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ ‘నువ్వే కావాలి’తో తీరిపోయాయి’ అని స్రవంతి రవికిషోర్‌ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33QYVTn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...