గత కొన్నిరోజుల క్రితం హీరో కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనతో పాటు తన సతీమణి , ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివానీలకు కరోనా సోకిందని పేర్కొంటూ రాజశేఖర్ స్వయంగా ట్వీట్ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్నిరోజులకు జీవిత, శివాత్మిక, శివానీలు కరోనా నుంచి బయటపడ్డప్పటికీ రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనా చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది ప్రేక్షకలోకం. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన జీవిత.. ప్రస్తుతం తన భర్త రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరూ పాజిటివ్గా ఉండాలని కోరుతూ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఆయన త్వరగా కరోనా నుంచి బయటపడాలని ప్రార్థించండి అని విజ్ఞప్తి చేశారు జీవిత. Also Read: ప్రస్తుతం రాజశేఖర్ సిటీ న్యూరో సెంటర్లో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు తన తండ్రి రాజశేఖర్ కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన కుమార్తె శివాత్మిక తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37B2Dmu
v
No comments:
Post a Comment