Tuesday, 20 October 2020

Hyd Floods: వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్ లోకం.. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు భారీ విరాళాలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగి ఎంతోమంది ఆశ్రయం కోల్పోయారు. దీంతో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విపత్కర పరిస్థితి చూసి వరద బాధితులను పెద్ద మనసుతో ఆదుకునేందుకు ముందుకొచ్చారు పలువురు టాలీవుడ్ ప్రముఖులు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు సినీ నటులు. ఇప్పటికే నందమూరి నట సింహం బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం కోటి 50 లక్షలు విరాళం ప్రకటించగా కోటి రూపాయల సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎవరికి వీలైనంతగా వాని సాయం చేయాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. మహేష్ బాబు కూడా కోటి విరాళం అందించనున్నట్లు తెలపగా.. ఎన్టీఆర్ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇకపోతే వరద బాధితుల తక్షణ పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేయడం సంతోషకరని పేర్కొన్న 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తానని తెలిపారు. ఈ ఏడాదంతా చాలా ఇబ్బందికర పరిస్థితులు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ.. తన వంతుగా సీఎం రీలీఫ్ ఫండ్‌కు 10 లక్షలు ఇస్తున్నానని తెలిపారు. కష్ట సమయంలో చాలా మంది తమ వంతు సహాయసహకారాలను అందించారని కోరుతూ వరద బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సాయం చేద్దామని పిలుపునిచ్చారు. దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్‌లు కూడా బాధితులకు అండగా నిలుస్తూ చెరో 5 లక్షలు ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dLOm7l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...