లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్, షూటింగ్స్ అన్నీ రీ ఓపెన్ కావడంతో కరోనాపై జనం ఫోకస్ బాగా తగ్గింది కానీ మహమ్మారి ప్రభావం మాత్రం చాలా చోట్ల చూపిస్తూనే ఉంది. షూటింగ్స్ నిమిత్తం సెట్స్ పైకి వస్తున్న పలువురు సినీ నటులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ సహా.. ఆయన ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. అయితే వీరిలో ఒక్క రాజశేఖర్ పరిస్థితి కాస్త విషమంగా ఉందని తెలియడంతో సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ రియాక్ట్ అయ్యారు. కరోనా బారినపడి రాజశేఖర్ కుమార్తెలు , శివానీ వెంటనే కోలుకోగా.. ఆయన, సతీమణి జీవిత మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా జీవితకు కూడా కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిసింది. అయితే కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బంది పడుతున్నారని, మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నానని.. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయండి అంటూ ట్వీట్ చేసింది రాజశేఖర్ కుమార్తె శివాత్మిక. Also Read: శివాత్మిక ట్వీట్ చూసిన చిరంజీవి ఆమె పెట్టిన ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ధైర్యం చెప్పారు. డియర్ శివాత్మిక.. మీ తండ్రి, నా సహచరుడు, స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనకు, మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి.. ధైర్యంగా ఉండమని పేర్కొన్నారు. మరోవైపు రాజశేఖర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని పలువురు సినీనటులు కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37w38Oo
v
No comments:
Post a Comment