హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీకారం’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అక్టోబర్ 2న తిరుపతిలో ప్రారంభమైన ‘శ్రీకారం’ షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. షూటింగ్కు తమ పూర్తి సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ‘‘శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో షూటింగ్ అనుకున్న షెడ్యూల్లో పూర్తి అయ్యింది. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, నరేష్, రావు రమేష్, సాయి కుమార్, సత్య, సప్తగిరి, ఆమని ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. టాకీ పార్ట్తో పాటు దినేష్ మాస్టర్ నేతృత్వంలో ఒక సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఈ కరోన సమయంలో అందరి సహకారంతో షూటింగ్ ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగింది’’ అని చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. శర్వానంద్కు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోన్న ఈ సినిమాకు కిషోర్.బి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై గోపీ ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్లాక్ బాస్టర్ ‘గద్దలకొండ గణేష్’ తరువాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో వస్తోన్న రెండో సినిమా ‘శ్రీకారం’. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35KdjwC
v
No comments:
Post a Comment