Tuesday, 27 October 2020

చిరంజీవి టైటిల్‌తో వస్తోన్న శ్రీకాంత్.. హీరోయిన్‌గా ‘పటాస్’ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘మరణమృదంగం’ టైటిల్‌తో హీరో వస్తున్నారు. హరిప్రియ మూవీస్ బ్యానర్‌పై, మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపురమేష్ నిర్మాతగా వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణమృదంగం’. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ‘‘మరణమృదంగం చిత్రంలో హీరో శ్రీకాంత్‌కు జోడీగా ‘పటాస్’ ఫేమ్ శృతిశోది ఖరారు అయ్యింది. శ్రీకాంత్ యాక్షన్ రివేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ నవంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇదొక మంచి కథ, శ్రీకాంత్‌కు బాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాతో శ్రీకాంత్‌కు మంచి బ్రేక్ లభిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్లు దర్శకుడు వెంకటేష్ రెబ్బ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. మేము ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్‌తో తెరకెక్కిస్తున్నాం’’ అని అన్నారు. సాంకేతిక నిపుణులునిర్మాత: డాక్టర్ కుంచపురమేష్ సహానిర్మాతలు: మధు రెబ్బ, కుంచపు అరుణ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు కెమెరామెన్: చిట్టిబాబు ఫైట్స్: పి.సతీష్ సంగీతం: మంత్ర ఆనంద్ కథ, మాటలు: డి.తులసీ దాస్ దర్శకత్వం: వెంకటేష్ రెబ్బ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jxy7fz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...