Thursday, 22 October 2020

మాది నాన్న గారి స్కూల్.. దేనికైనా రెడీ అయి ఉంటాం: నందమూరి బాలకృష్ణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నందమూరి స్వీయదర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నర్తనశాల'. ఓ పౌరాణిక సినిమాకు దర్శకత్వం వహించాలనే బలమైన కోరికతో చాలా ఏళ్ల క్రితం ఈ సినిమాను ప్రారంభించారు బాలకృష్ణ. దీనికోసం ఆయనే స్వయంగా అర్జునుడి వేషం వేసుకొని కెమెరా ముందుకొచ్చారు. చిత్రంలో ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులను తీసుకొని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే అనూహ్యంగా హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. అలా ఆగిపోయిన 'నర్తనశాల' సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేసిన బాలయ్య.. దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా కానుకగా ఈ నెల 24న శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. Also Read: సౌందర్య, శ్రీహరి లాంటి దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించడం ఈ చిత్రంతోనే సాధ్యమైందని, ఈ సినిమా రూపొందించే సమయంలో ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి 10 రోజులు మాత్రమే డేట్స్‌ తీసుకున్నానని, కానీ 5 రోజులలోనే షూట్‌ చేసేశానని బాలయ్య తెలిపారు. మాది నాన్న గారి స్కూల్.. దేనికైనా రెడీ అయి ఉంటామని చెప్పారు. కళాకారులకు గౌరవం ఇవ్వడం, పని చేస్తున్నప్పుడు అందరూ అందులో ఇన్‌వాల్వ్ అయ్యేలా చూసుకోవడం వంటివన్నీ నాన్నగారి స్కూల్‌ నుంచి నేర్చుకున్నానని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగిస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35mKvtQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...