Wednesday, 7 October 2020

ఎస్పీ బాలు ఆశీస్సులతో రంగంలోకి దిగిన శ్రీవిష్ణు

యువ కథానాయకుడు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలపాటు ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ బుధవారం తిరిగి ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభించటానికి ముందు స్వర్గీయ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులు అర్పించింది చిత్ర యూనిట్. ఎస్పీ బాలు ఆశీస్సులతో షూటింగ్‌ను పునః ప్రారంభించినట్లు తెలిపారు నిర్మాతలు. శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభావంతులతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న చిత్రమిదని నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తెలిపారు. కథానాయకుడు శ్రీవిష్ణు, కాదంబరికిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్‌లు తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హౌస్‌లో జరిగింది. సినిమా మొత్తం పూర్తయ్యేవరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి. కాగా, ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్, వాసు ఇంటూరి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేదరామన్, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటింగ్: విప్లవ్ నైషధం, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, స్టైలింగ్: శృతి కూరపాటి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nlZexj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...