Tuesday, 27 October 2020

ఐసీయూ లోనే రాజశేఖర్.. ప్లాస్మా చికిత్స అందిస్తున్న డాక్టర్లు.. ఆసుపత్రి నుంచి తాజా హెల్త్ బులెటిన్

ఇటీవలే కరోనా సోకిన సీనియర్ హీరో అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా (మంగళవారం) ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం. మెల్లగా రాజశేఖర్ ఆరోగ్యం కుదుట పడుతోందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలోనే రాజశేఖర్‌కి చికిత్స అందిస్తున్నామని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్ తొలగించామని, ప్లాస్మా థెరపీతో పాటు సైటోసోర్బ్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు. Also Read: ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి, త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటోంది సినీ లోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37LhfQ4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...